
పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి చిత్రాలతో యువతలో కథానాయకుడు విజయ్ దేవరకొండ సంపాందించిన పాపులారిటీ అంతా ఇంతా కాదు. తను నటిస్తున్న తాజా చిత్రం ‘ఏ మంత్రం వేశావే’. శివానీసింగ్ నాయికగా నటిస్తుంది. గోలీసోడా ఫిలిమ్స్ నిర్మాణంలో సురక్ష్ ఎంటర్టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి.మల్కాపురం శివకుమార్ సమర్పణలో తెరకెక్కుతోంది. శ్రీధర్ మర్రి స్వీయ దర్శకత్వంలో రూపొందనున్న ఈ చిత్రాన్ని మార్చి 9న ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు.
మల్కాపురం శివకుమార్ మాట్లాడుతూ ‘గేమ్ నేపథ్యంలో నడిచే విభిన్నమైన కథ ఇది. విజయ్ దేవరకొండ పాత్ర ఇందులో చాలా వైవిధ్యంగా, నేటి యువతరానికి ప్రతినిధిగా కనిపించబోతున్నాడు. విదేశాల్లో చిత్రీకరించిన సన్నివేశాలు చిత్రానికి హైలైట్’ అని అన్నారు. శివన్నారాయణ, రాజబాబు, నీలాక్షిసింగ్, ఆశిష్రాజ్, ప్రభావతి, దీపక్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం : అబ్భత్ సమత్, సినిమాటోగ్రఫీ: శివారెడ్డి.