ధర్నా చౌక్ వద్ద బీసీ రాజకీయ చైతన్య దీక్ష

636
Telangana BC federation

తెలంగాణ బిసి ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర అధ్యక్షులు బెల్లపు దుర్గారావు అధ్యక్షతన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కీర్తి యుగంధర్ ఆధ్వర్యంలో బిసి రాజకీయ చైతన్య దీక్ష ఏర్పాటు చేయడం జరిగినది. ఈ దీక్షలో తెలంగాణ బీసీ ఫెడరేషన్ కులాల సమితి రాష్ట్ర కార్యవర్గంతో పాటు గ్రేటర్ హైదరాబాద్, వివిధ జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యవర్గ ముఖ్య ప్రతినిధులు ఈ బీసీ రాజకీయ చైతన్య దీక్షలో అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

ముఖ్యంగా దీక్ష ఉద్దేశం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత 9 సంవత్సరాల పరిపాలనలో బీసీలను అన్ని విధాలుగా నిర్లక్ష్య భావంతో చూస్తుందని, బీసీ కులాల పట్ల సవతి తల్లి ప్రేమ చూపిస్తుందని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్రంలో 52% బీసీ కులాలు ఓటు బ్యాంకు రాజకీయాలతో గెలిచి అధికారంలో ఉన్న ప్రభుత్వాలు బీసీల సంక్షేమాన్ని విస్మరిస్తుందన్నారు.

ప్రస్తుతం ప్రవేశపెట్టిన ₹6229 కోట్ల బడ్జెట్ రాష్ట్ర బడ్జెట్ లో 2% మాత్రమే ఉండటం అందులోనూ ఫెడరేషన్ల ఊసే లేకపోవడం బాధాకరమన్నారు. ఎంబీసీ కార్పొరేషన్ను నిర్వీర్యం చేశారని అన్నారు. తెలంగాణలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల పైన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.

BC Federation kulaala samithi

చర్చ గోష్టిలో తెలంగాణలోని వివిధ అనగారిన ఎంబిసి కులాలు మరియు బీసీ ఫెడరేషన్ కులాల ప్రతినిధులు పాల్గొని పలు అంశాలపై చర్చించడం జరిగింది. అసెంబ్లీలో అనగారిన వర్గాల నుంచి ప్రాతినిధ్యం లేకపోవడం వల్లే ఎన్నో పర్యాయాలు మంత్రులకు ఎమ్మెల్యేలకు వివిధ ప్రతిపక్ష పార్టీల నాయకులకు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ ఏ ఒక్క అంశాల్లో కూడా బీసీలకు న్యాయం చేసే విధంగా స్పందించకపోవడం చాలా దురదుష్టకరమని పేర్కొన్నారు.

రాజకీయ ప్రాతినిధ్యం లేనటువంటి కులాలకు అన్యాయం జరుగుతుందని భావించి రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల నుండి బీసీ వర్గాలకు సీట్లు కేటాయించే విధంగా అధికార, ప్రతిపక్ష పార్టీలను డిమాండ్ చేస్తాం. అవసరమైతే స్వతంత్ర అభ్యర్థులుగా రాష్ట్ర వ్యాప్తంగా అనగారిన అన్ని సామాజిక వర్గాల తరపునుండి స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసి అసెంబ్లీలో వాని వినిపించాలని అందుకు అవసరమైన కార్యాచరణతో ముందుకు వెళతామని ప్రకటించారు.