
గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై యంగ్ హీరో కార్తికేయ “చావు కబురు చల్లగా” అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.
యువ దర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో అనసూయ ఓ అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే మాస్ మసాలా ఐటమ్ సాంగ్ లో చిందేసింది.
“చావు కబురు చల్లగా” చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు.
తాజాగా ఈ చిత్రం నుంచి “కదిలే కాలాన్నడిగా…” అంటూ బస్తీ బాలరాజు, మల్లికల మధ్య లవ్ ట్రాక్ సన్నివేశాలతో సాగే ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది.
గౌతమ్ భరద్వాజ్, శాషా తిరుపతి ఆలపించిన ఈ లిరికల్ వీడియో సాంగ్ ను మీరు కూడా వీక్షించండి.