
ఎనర్జిటిక్ హీరో రామ్ 19వ సినిమాపై తాజాగా అఫీషియల్ ప్రకటన వచ్చింది.
‘పందెం కోడి’, ‘ఆవారా’ తదితర డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకుల్ని అలరించిన లింగుస్వామి దర్శకత్వంలో రామ్ తదుపరి సినిమా ఉంటుందని ఈ ప్రకటనలో తెలిపారు.
సిల్వర్ స్కీన్ పతాకంపై శ్రీనివాస చిత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఏప్రిల్లో ఈ చిత్రం సెట్స్ పైకి వెళ్తుంది. ఈ మూవీని తెలుగు, తమిళ భాషలలో రూపొందించనున్నారు.
సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు మరి కొద్ది రోజులలో తెలియజేయనున్నారు.
Tremendous Response for Terrific Combination of Energetic Star @ramsayz & Director @dirlingusamy#RaPo19 is Trending India wide#SrinivasaaChitturi @SS_Screens #SSS6 pic.twitter.com/32bipksIK0
— BARaju (@baraju_SuperHit) February 18, 2021
కాగా హీరో రామ్ “ఇస్మార్ట్ శంకర్” చిత్రంతో భారీ హిట్ అందుకున్నాడు. పూరి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంతో మాస్ ఆడియన్స్ ను మెప్పించి, మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు రామ్.
ఈ చిత్రం అందించిన విజయంతో మంచి జోష్ లో ఉన్న రామ్ వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు.
ఇటీవలే రామ్ “రెడ్” మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వచ్చింది.