తేజ బర్త్ డే… “చిత్రం”కు సీక్వెల్ “చిత్రం 1.1”

160
Director Teja announces sequel to ‘Chitram’ movie

నేడు ప్రముఖ దర్శకుడు తేజ పుట్టినరోజు. ఈ సందర్భంగా గతంలో తేజ దర్శకత్వం వహించిన బ్లాక్ బస్టర్ హిట్ “చిత్రం” సీక్వెల్ ను ప్రకటించారు మేకర్స్.

“చిత్రం 1.1” పేరుతో రూపొంద‌నున్న ఈ చిత్రం 2021లో షూటింగ్ జ‌రుపుకోనుంది. తొలి పార్ట్‌కు సంగీతం అందించిన ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఇప్పుడు సీక్వెల్‌కు సంగీత ద‌ర్శ‌కుడిగా ప‌ని చేయ‌నున్నారు.

న‌టీన‌టులు ఎవ‌రనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

“చిత్రం” మూవీ 2000 జూన్ 16న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గ‌త ఏడాది జూన్ 16కు 20 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంది.

కెమెరా మెన్ నుంచి దర్శకుడిగా మారిన దర్శకుడు తేజ. ఆయన మొదటి సినిమా “చిత్రం”.

తక్కువ బడ్జెట్ తో ఉదయ్ కుమార్, రీమాసేన్, చిత్రం శీను వంటి అనేక కొత్త నటీనటులను సినీ పరిశ్రమకు పరిచయం చేశాడు.

చిన్న సినిమాగా విడుదలై పెద్ద విజయం సాధించింది ఈ “చిత్రం”.

కాగా ఇండస్ట్రీలోకి “చిత్రం” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తేజ.. నితిన్, ఉదయ్ కిరణ్, రీమా సేన్, సదా, కాజల్, నవదీప్, సుమన్ శెట్టి వంటి నటీనటులతో పాటు ఆర్పి పట్నాయక్ వంటి సంగీత దర్శకులని కూడా ప‌రిచ‌యం చేశాడు.

తేజ చివ‌రిగా “నేనే రాజు నేనే మంత్రి” అనే సినిమాతో మంచి హిట్ కొట్టారు.

ఆయన నుంచి చివరిగా వచ్చిన చిత్రం “సీత”. బెల్లం కొండ శ్రీనివాస్, కాజల్ హీరో హీరోయిన్స్‌గా నటించిన ఈ చిత్రానికి మిశ్రమ స్పందన వచ్చింది.