
బాలీవుడ్ నటి దియా మీర్జా పెళ్ళికి సంబంధించిన వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ బ్యూటీ ఫిబ్రవరి 15న వైభవ్ ను రెండవ వివాహం చేసుకుంది. ముంబైలో కొద్ది మంది సన్నిహితులు, శ్రేయోభిలాషుల మధ్య వీరి వివవాం జరిగింది.
ఇందులో దియా ఎర్రటి చీరలో మెరిసింది. వైభవ్ కుర్తాలో కలర్ఫుల్గా కనపించాడు. వీరి ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.
అదితీ రావు హైదరి ఈ వేడుకలో పాల్గొంది. అంతేకాదు అదితి జూతా చుపాయి సాంప్రదాయం ప్రకారం మండపం దగ్గరకు వెళ్లే ముందు వరుడి చెప్పులు దాచడం… ఇందులో భాగంగా వరుడు వేసుకోవాల్సిన చెప్పులు దాచిపెట్టింది.
చెప్పులతో దిగిన ఫొటోను అదితి తన సోషల్ మీడియాలో షేర్ చేసింది.
కాగా ఇది దియాకు రెండో పెళ్లి. దియా 2004లో నిర్మాత సాహిల్ సంఘాను పెళ్లి చేసుకుంది.
ఐదేళ్ల వైవాహిక జీవితం తర్వాత వీరిద్దరు పలు కారణాల వలన విడిపోయారు. కొన్నాళ్ళుగా వైభవ్ రేఖితో ప్రేమాయణంలో ఉన్న
ప్రస్తుతం దియామీర్జా తెలుగు చిత్రం ‘వైల్డ్డాగ్’ చిత్రంలో నటిస్తోంది.