
అజయ్ దేవగణ్ హీరోగా నటిస్తున్న చిత్రం ‘మైదాన్’. ఈ చిత్రాన్ని అక్టోబర్ 15న రిలీజ్ చేయనున్నారు. బోనీ కపూర్ “మైదాన్” చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
అయితే తాజాగా దర్శకుడు రాజమౌళిపై బోనీ కపూర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. “మైదాన్” విడుదల చేయనున్న రెండు రోజుల ముందే “ఆర్ఆర్ఆర్” సినిమాను విడుదల చేస్తున్నారు.
“ఆర్ఆర్ఆర్”లో కీలకపాత్ర పోషిస్తున్న అజయ్ దేవ్గణ్ “మైదాన్”లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు.
బోనీ కపూర్ మాట్లాడుతూ “మైదాన్” సినిమా షూటింగ్ కరోనా కారణంగా నిలిచిపోవడంతో… తాము అనుకున్న దానికంటే భారీగానే ఖర్చుపెట్టామని, మళ్లీ సినిమా షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే తాము “మైదాన్” విడుదల తేదీని ప్రకటించామని తెలిపారు.
ఆ ప్రకటన చేసిన కొన్ని రోజులకే “ఆర్ఆర్ఆర్” సినిమా విడుదల ప్రకటన వచ్చిందని, ఇది అనైతికమైన చర్య అంటూ మండిడపడ్డారు బోనీ కపూర్.
తాను ఈ విషయంపై ఇటీవల రాజమౌళితో ఫోన్లో మాట్లాడగా… విడుదల తేదీతో తనకు సంబంధం లేదని, అది నిర్మాతల ఇష్టప్రకారం జరిగిందని ఆయన అన్నారని, అయితే ఆయన మాటలను తాను నమ్మాలనుకోవడం లేదని అన్నారు బోనీ కపూర్.
అంతేకాదు సినీ పరిశ్రమలో మంచి పేరున్న రాజమౌళి ఇలాంటి చర్య ఊహించలేదని అన్నారు బోనీ కపూర్. ఇంతకుముందు కూడా ఓసారి ఆయన ఈ విషయంపై ఫైర్ అయ్యారు.