ఎన్ కౌంటర్ లో నలుగురు నక్సల్స్ మృతి

237
Four Naxals killed in encounter

మధ్యప్రదేశ్ లో జరిగిన ఎన్ కౌంటర్ లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు.

మండ్ల జిల్లా మోతినాల లాల్పుర్ గ్రామ అటవీ ప్రాంతంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.

మృతుల్లో ఒక మహిళా నక్సలైట్ ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. పోలీసులకు, మావోలకు మధ్య దాదాపు 4 గంటల పాటు కాల్పులు జరిగాయి.

అంతకుముందు బాలాఘాట్ జిల్లా కిర్నాపుర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బోర్వాన్ అటవీ ప్రాంతంలోనూ ఎన్ కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా మావోయిస్టులను పోలీసులు హతమార్చారు.

వారి నుంచి 12 రైఫిల్స్, ఇతర మందు గుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు.

ఈ మహిళా మావోయిస్టులపై 20 లక్షల రివార్డు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఎన్ కౌంటర్ తో సమీప గ్రామాల ప్రజలు భయాందోలనకు గురవుతున్నారు. ఎప్పుడేమి జరుగుతోందని వనికిపోతున్నారు.