గీతా ఆర్ట్స్ 2 బ్యానర్పై యంగ్ హీరో కార్తికేయ “చావు కబురు చల్లగా” అనే డిఫరెంట్ మూవీలో నటిస్తున్నారు. కార్తికేయకు జంటగా లావణ్య త్రిపాఠి నటిస్తోంది.
యువదర్శకుడు కౌశిక్ పెగల్లపాటి దర్శకత్వం వహిస్తున్నారు. జాక్స్ బిజోయ్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.
మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు బన్నీ వాసు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
ఈ సినిమాలో అనసూయ ఓ మాస్ మసాలా ఐటమ్ సాంగ్ లో చిందేసింది. దీనికి సంబంధించిన షూటింగ్ పూర్తయిపోయింది.
అవుట్ అండ్ అవుట్ మాస్ బీట్స్ తో సాగే ఈ పాటను త్వరలోనే విడుదల చేస్తామని చిత్ర బృందం తెలిపింది. చావు కబురు చల్లగా చిత్రాన్ని మార్చి 19న భారీ స్థాయిలో విడుదల చేయడానికి నిర్మాత బన్నీ వాసు సన్నాహాలు చేస్తున్నారు.
ఈ సినిమా పాటలను ప్రముఖ ఆడియో కంపెనీ ఆదిత్య మ్యూజిక్ విడుదల చేస్తున్నారు. అనసూయ భరద్వాజ్ కు సంబంధించిన స్టిల్స్ ను తాజాగా విడుదల చేశారు.
.@anusuyakhasba to feature in a special mass dance number in @ActorKartikeya‘s #ChaavuKaburuChallaga #CKC in theatres from March 19th, 2021.#AlluAravind @Itslavanya @Koushik_psk @JxBe #BunnyVas #SatyaG #KarmChawla @imsarathchandra @adityamusic @GA2Official #CKCFromMarch19 pic.twitter.com/xer5dALg37
— BARaju (@baraju_SuperHit) February 15, 2021