
ఈ మధ్య చాలా మంది ఈజీమనీకి అలవాటుపడుతున్నారు. టెక్నాలజీని ఉపయోగించి డబ్బులు కాజేస్తున్నారు.
ఆ వ్యక్తి ఏ అవసరం కోసం డబ్బు దాచుకున్నోడో అన్న మానవత్వం కూడా ఉండటం లేదు. దొడ్డి దారిన డబ్బు కాజేసి జల్సాలు చేస్తున్నారు.
ఈ మధ్య డిజిటల్ పేమెంట్లు పెరిగిపోయాయి. అదే సమయంలో మోసాలూ పెరిగాయి. ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు అకౌంట్ నుంచి డబ్బు కట్ అవుతోంది.
ఈ క్రమంలో దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు ఎస్బీఐ అప్రమత్తమైంది. ఆన్లైన్ యూపీఐ మోసాలపై తన కస్టమర్లను అప్రమత్తం చేసింది.
ఎలాంటి యూపీఐ లావాదేవీ చేయకుండానే బ్యాంకు ఖాతా నుంచి మనీ కట్ అయినట్టు మెసేజ్ వస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఎస్బీఐ సూచించింది.
తమ దృష్టికి తెస్తే యూపీఐ సేవను నిలిపివేస్తామని చెప్పింది. అలాంటి సమయంలో తక్షణమే యూపీఐ సేవలను నిలిపివేయడానికిగాను ఎస్బీఐ కొన్ని నంబర్లు కూడా ఇచ్చింది.
టోల్ ఫ్రీ నెంబర్ 1800111109, ఐవీఆర్ నెంబర్లు 1800-425-3800..1800-11-2211కు ఫోన్ చేయడం లేదా 9223008333 నెంబర్కు ఎంఎంఎస్ చేయాలని తెలిపింది.
https://cms.onlinesbi.com/CMS/లోనూ ఫిర్యాదు చేయవచ్చని వెల్లడించింది. టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయడం ద్వారా కూడా వినియోగదారులు తన యూపీఐ సేవలను నిలిపివేయవచ్చని పేర్కొంది.
ఈ మేరకు ట్వీట్టర్ హ్యాండిల్ ద్వారా 44 కోట్ల మంది తన ఖాతాదారులను ఎస్బీఐ హెచ్చరించింది.
ఖాతాదారులు ఎవరైనా వారు చేయని యూపీఐ పేమెంట్కు డబ్బు డెబిట్ చేయమని ఎస్ఎంఎస్ వస్తే, అప్రమత్తంగా ఉండాలి.
ఈ సూచనలను పాటించి మీ డబ్బు పట్ల జాగ్రత్తగా ఉండండి.
ఆన్లైన్ మోసాల కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎస్బీఐ ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను అప్రమత్తం చేస్తుంది అని ట్విట్టర్లో పేర్కొంది.