
ఎలక్రానిక్స్ రంగంలో ఏదో ఒక కొత్త పరికరం మార్కెట్లోకి విడుదలవుతూనే ఉంటుంది. మరింత ఉత్తమ ఉత్పత్తులను కంపెనీలు అందిస్తూనే ఉంటాయి.
ఈ క్రమంలోనే ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షియోమీ సరికొత్త మానిటర్ను మార్కెట్లోకి విడుదల చేసింది.
27-అంగుళాల ఫుల్ హెచ్డీ కంప్యూటర్ మానిటర్ను లాంఛ్ చేసింది.
రెడ్మి డిస్ప్లే 1ఎ తర్వాత షియోమి సబ్ బ్రాండ్ నుంచి వస్తోన్న రెండో మానిటర్ ఇదే.
ఇది ఫుల్ హెచ్డి రిజల్యూషన్, మూడు వైపులా స్లిమ్ బెజెల్తో అట్రాక్టివ్ లుక్ కలిగి ఉంటుంది.
అయితే బ్లాక్ కలర్ ఆప్షన్లో మాత్రమే ఇది అందుబాటులో ఉంది.
ఇది మెరుగైన ఫామ్ ఫ్యాక్టర్ను కలిగి ఉంటుంది. మెరుగైన పిక్చర్ క్వాలిటీ కోసం దీనిలో ఐపిఎస్ ప్యానెల్ను కూడా చేర్చింది.
దీనిలోని RGB కలర్ స్పేస్100 శాతం కవరేజీని అందిస్తుందని రెడ్మి పేర్కొంది.
ఇక దీని ధర విషయానికి వస్తే CNY 799 (భారత కరెన్సీలో సుమారు రూ .9,100)కే విక్రయించనుంది.
ప్రస్తుతం దీన్ని చైనా వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నట్టు తెలిపింది. వారు జెడి.కామ్, షియోమి యోపిన్ ప్లాట్ఫాంలపై మానిటర్ను కొనుగోలు చేయవచ్చని తెలిపింది.
బుకింగ్ చేసుకున్న కస్టమర్లకు మార్చి 9 నుండి మానిటర్ డెలివరీలు ప్రారంభమవుతుందని స్పష్టం చేసింది.
అయితే అంతర్జాతీయ మార్కెట్లో దీన్ని ఎప్పుడు అందుబాటులోకి తెస్తారనే విషయంపై మాత్రం రెడ్మీ ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు.
రెడ్మి 27- అంగుళాల కొత్త మానిటర్లో ఫుల్ -హెచ్డి (1,920×1,080 పిక్సెల్స్) ఐపిఎస్ ప్యానెల్ను అందించింది. ఇది పైభాగంలో అన్ని వైపులా స్లిమ్ బెజెల్స్ను కలిగి ఉంటుంది.
178- డిగ్రీల కోణాలతో, 100 శాతం RGB కలర్ స్పేస్ను చేర్చింది. అంతేకాక, ఇది టియువి రీన్ల్యాండ్లో బ్లూ లైట్ సర్టిఫికేషన్తో వస్తుంది.
ఈ మానిటర్ 75Hz గరిష్ట రిఫ్రెష్ రేట్, 16: 9 ఆస్పెక్ట్ రేషియో, 6ms GTG రెస్పాన్స్ టైం, 10,00,000: 1 కాంట్రాస్ట్ రేషియోతో అందుబాటులో ఉంటుంది.
ఇక దీనిలో 300 నిట్స్ గరిష్ట ప్రకాశాన్ని అందించింది. మానిటర్ కనెక్టివిటీ కోసం, HDMI 1.4 పోర్ట్, VGA పోర్ట్, వెనుక భాగంలో హెడ్ఫోన్ జాక్లను చేర్చింది.
మానిటర్ను నిలబట్టే Y ఆకారపు స్టాండ్ను సర్దుబాటు చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. 4.3 కిలోల బరువు గల 27-అంగుళాల రెడ్మి మానిటర్ 613.2×205.3x476mm డైమెన్షన్ను కలిగి ఉంటుంది.
అంతేకాకుండా ఇది కేవలం 7.5 మి.మీ. మందం గల ప్యానెల్తో వస్తుంది. మానిటర్తో పాటు ఎక్స్టర్నల్ పవర్ అడాప్టర్ను కూడా రెడ్మీ అందిస్తోంది.