అల్లరి నరేష్ ఎమోషనల్… “నాంది” సక్సెస్

164
Allari Naresh Emotional On Naandhi Success Meet

అల్లరి నరేష్ నటించిన ప్రయోగాత్మక చిత్రం “నాంది” శుక్రవారం విడుదలైంది. ఈ వైవిధ్యమైన చిత్రం హిట్ టాక్ తో దూసుకెళ్తోంది.

అయితే దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత మళ్ళీ హిట్ అందుకున్న అల్లరి నరేష్ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు.

అల్లరి నరేష్ కెరీర్‌లో 57వ సినిమాగా ‘నాంది’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఎస్వీ2 ఎంటర్‌టైన్మెంట్‌ బ్యానర్‌పై రూపొందిన ఈ సినిమాలో ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి.

చిత్రంలో వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్‌, ప్రియ‌ద‌ర్శి, దేవీప్రసాద్‌, విన‌య్ వ‌ర్మ, సి.ఎల్‌.న‌ర‌సింహారావు, శ్రీ‌కాంత్ అయ్యంగార్‌ ఇతర ముఖ్యపాత్రల్లో నటించారు.

విడుదల ముందు వచ్చిన అప్‌డేట్స్ భారీ హైప్ క్రియేట్ చేయడంతో భారీ ఓపెనింగ్స్ దక్కాయి. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో విజయోత్సవం నిర్వహించారు యూనిట్ సభ్యులు.

ఈ కార్యక్రమంలో అందరి ముందు కన్నీళ్లు పెట్టుకున్నారు అల్లరి నరేష్. నాంది సినిమాలో తండ్రిగా నటించిన దర్శకుడు, నటుడు దేవిప్రసాద్‌ని హత్తుకొని ఏడ్చేశారు.

2012 ఆగస్టులో ‘సుడిగాడు’ హిట్ తర్వాత తన కెరీర్‌లో పెద్ద విజయాన్ని అందుకున్న చిత్రం నాంది అని, ఈ విజయం కోసం ఎనిమిదేళ్ల పాటు ఎదురుచూశానని నరేష్ అన్నారు.

వరుసగా ఎనిమిదేళ్లు పరాజయాల్లో ఉన్నా కూడా తనకు ధైర్యం చెబుతూ ఓ సీరియస్‌ సినిమా చేద్దామని సతీష్‌ వేగేశ్న ప్రోత్సహించారని, తన రెండో ఇన్నింగ్స్‌కి ‘నాంది’తో దర్శకుడు విజయ్‌ కనకమేడల పునాది వేశారని తెలుపుతూ నరేష్ భావోద్వేగం చెందారు.