వైద్య విద్యను మధ్యలో మానేస్తే రూ.5 లక్షలు జరిమానా

593
medical-students-to-sign-rs-5-lakh-bond-in-haryana

హర్యానాలో వైద్య విద్యను అభ్యసించే విద్యార్థులు ఇకపై రూ.5 లక్షలు, రూ.7.5 లక్షల పూచీకత్తుతో కూడిన బాండ్లను సమర్పించాల్సి ఉంటుంది. కోర్సు పూర్తికాకముందే కాలేజీ నుంచి వెళ్లిపోనంటూ ఇద్దరు వ్యక్తుల పూచీకత్తుతో కూడిన పత్రాలనూ సమర్పించాలి. ఈ నూతన నిబంధన 2018-19 విద్యా సంవత్సరం నుంచి అమల్లోకి రానుంది. వైద్య విద్యలో సీటు పొందిన తర్వాత విద్యార్థులు కోర్సు పూర్తికాకముందే మధ్యలో మానేస్తే ఈ బాండ్లను తిరిగి ఇవ్వరు.



ఎండీ, ఎంఎస్‌లకు రూ.7.5 లక్షలు .. హర్యానా ప్రభుత్వ నిర్ణయం

వైద్య విద్య, పరిశోధన విభాగం అధికార ప్రతినిధి ఒకరు మాట్లాడుతూ ఎంబీబీఎస్, బీడీఎస్ విద్యార్థులు రూ.5 లక్షల బాండ్లను, ఎండీ, ఎంఎస్ విద్యార్థులు రూ.7.5 లక్షల బాండ్లను సమర్పించాల్సి ఉంటుందని చెప్పారు. ఈ నూతన నిబంధన కన్వీనర్ కోటా విద్యార్థులతోపాటు మేనేజ్‌మెంట్ విద్యార్థులకు కూడా వర్తిస్తుందని తెలిపారు. అలాగే పోస్టుగ్రాడ్యుయేట్ చదువుతున్న విద్యార్థులు ఒకవేళ మధ్యలో మానేస్తే మూడేండ్ల వరకు ఏ కాలేజీలోనూ అడ్మిషన్ ఇవ్వరని పేర్కొన్నారు. వైద్య విద్యార్థులు మధ్యలోనే కాలేజీ వదిలేస్తున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.