
ఎంబీఏ, ఎంసీఏ ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ షెడ్యూల్ ను తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి విడుదలచేసింది.
ఈ ఏడాది ఆగస్టు మాసంలో ఐసెట్ను నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యా మండలి ప్రకటించింది.
ఏప్రిల్ 4వ తేదీన నోటిఫికేషన్ విడుదల, ఏప్రిల్ 7 నుంచి జూన్ 15వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది.
ఆలస్య రుసుంతో జులై 30వరకు దరఖాస్తులు సమర్పించవచ్చునని కన్వీనర్ రాజిరెడ్డి తెలిపారు.
ఆగస్టులో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని 14 పట్టణాల్లో ఐసెట్ ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు.