మనుషులకూ బర్డ్‌ ఫ్లూ

218

ఇప్ప‌టి వ‌ర‌కు బ‌ర్డ్ ఫ్లూ అనేది కోళ్ల‌కు, ప‌క్షుల‌కు వ‌స్తుంద‌ని విన్నాం. కానీ తొలిసారి ఈ వ్యాధి మ‌న‌షుల‌కు సోకిన‌ట్టు నిర్ధార‌ణ అయింది.

తొలి కేసు ర‌ష్యాలో న‌మోదైంది. ఆ వ్య‌క్తిలో బ‌ర్డ్ ఫ్లూ ల‌క్ష‌ణాలు ఉన్న‌ట్టు వైద్యులు గుర్తించారు. మ‌నిషికి తొలి బ‌ర్డ్ ఫ్లూ గురించి ప్రపంచ ఆరోగ్య సంస్థ‌కు స‌మాచారం అందించారు.

ప‌క్షులకు వ‌చ్చే ఈ వ్యాధి మ‌నుషుల‌కు వ్యాపిస్తున్న‌ట్లు గురించారు. అయితే ఇది ఒక‌రి నుంచి మ‌రొక‌రికి వ్యాపించ‌ద‌ని మాత్రం తెలుస్తోంది. పౌల్ట్రి ఫామ్‌లో ఉండే కార్మికుల్లో ఈ వ్యాధిని గుర్తిస్తున్నారు.

దీనిపై మ‌రిన్ని ప‌రిశోధ‌న‌లు జ‌రుగుతున్నాయి. బ‌ర్డ్ ఫ్లూ సోకిన ప‌క్షులు అనారోగ్యంగా ఉన్నా లేదా చ‌నిపోయినా ఆ వ్యాధి మ‌నుషుల‌కు వ్యాపించే అవ‌కాశ‌ముంద‌ని వైద్య నిపుణులు చెబుతున్నారు.

అంతేకాకుండా ఈ బ‌ర్డ్ ఫ్లూ సోకిన వ్య‌క్తి మ‌ర‌ణించే అవ‌కాశం కూడా ఉంద‌ని నిర్ధారించారు. దీంతో ఈ వ్యాధిపై మ‌రింత లోతుగా అధ్య‌య‌నం చేయాల‌ని భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం మ‌న దేశంలోని ప‌లు రాష్ట్రాల్లో బ‌ర్డ్ ఫ్లూ చెల‌రేగిన సంగ‌తి తెలిసిందే. ఢిల్లీ, మహారాష్ట్ర, ఉత్తరాఖండ్, కేరళ, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌, హిమాచల్ ‌ప్రదేశ్‌, హర్యానా, గుజరాత్‌, యూపీతో పాటు పలు ప్రాంతాల్లో ఈ వ్యాధి కారణంగా లక్షల సంఖ్య‌లో జంతువులు మృత్యువాత పడ్డాయి.

దీంతో కేంద్రం హైఅలర్ట్‌ ప్రకటించింది. రాష్ట్రాలన్ని అప్రత్తమంగా ఉండాలని, బర్డ్‌ ప్లూ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకోవాలని కేంద్రం సూచనలు కూడా చేసింది.

మనుషులకు వ్యాప్తించే ఈ బర్డ్‌ ఫ్లూ లక్షణాలు అనేకం బయటపడుతున్నాయి.

గొంతు నొప్పి, దగ్గు, జ్వరం, అతిసారం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, వికారం, వాంతులు, తలనొప్పి వంటి లక్షణాలు ఉంటాయని చెబుతున్నారు.

అలాగే ఎటువంటి లక్షణాలు లేకుండా కేవలం కంటికి కూడా సంక్రమించవచ్చని తెలుస్తోంది.

ఈ బర్డ్‌ ఫ్లూ వైరస్‌లు రెండు రకాలుగా ఉంటాయి. మానవులలో అత్యంత సాధారణ రకం H5N1.

ఇది పక్షుల ద్వారా ప్రధానంగా వ్యాప్తి చెందుతుందని గుర్తించారు. మనుషుల్లో ఈ వైరస్‌ సాధారణమైన యాంటీవైరస్‌ ఔషధాలకు నిరోధకతను అభివృద్ధి చేస్తుంది.

అందుకే ప్రత్యామ్నాయ ఔషధాలను సూచిస్తున్నారు. పక్షులకు సోకే బర్డ్‌ ఫ్లూ మనుషులకు సంక్రమింస్తుండటంతో మరింత జాగ్రత్తగా ఉండాలని కేంద్ర ప్రభుత్వం, వైద్య నిపుణులు సూచిస్తున్నారు.