ఇండియాలో ఒప్పో ఎ5 2020 స్మార్ట్‌ఫోన్ విడుదల

284
smart phone

మొబైల్స్ తయారీదారు సంస్థ ఒప్పో తన నూతన స్మార్ట్‌ఫోన్ ఎ5 2020ని ఈ రోజు భారత మార్కెట్‌లో విడుదల చేసింది. ఈ ఫోన్‌కు చెందిన 3జీబీ ర్యామ్, 64జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.12,490 ఉండగా, 4జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియెంట్ ధర రూ.13,990గా ఉంది. ఈ నెల 21వ తేదీ నుంచి ఈ ఫోన్ వినియోగదారులకు లభ్యం కానుంది. ఈ ఫోన్‌లో పలు ఆకట్టుకునే ఫీచర్లను అందిస్తున్నారు.

ఒప్పో ఎ5 2020 స్మార్ట్‌ఫోన్‌లో.. 6.5 ఇంచుల డిస్‌ప్లే, ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్, 3/4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 12, 8, 2, 2 మెగాపిక్సల్ క్వాడ్రపుల్ బ్యాక్ కెమెరాలు, 8 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, డాల్బీ అట్మోస్, డ్యుయల్ 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 5.0, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ తదితర ఫీచర్లను అందిస్తున్నారు.