విశాఖకు వచ్చి చంద్రబాబు మొసలికన్నీరు: రోజా

231
Chandrababu sent home Kuppam people: Roja

టీడీపీ అధినేత చంద్రబాబుపై వైసీపీ నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శలు గుప్పించారు.

విశాఖ ఉక్కు కర్మాగారం పరిరక్షణ పోరాట యాత్ర పేరుతో వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చేపట్టిన పాదయాత్రలో రోజా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విశాఖ వచ్చి చంద్రబాబు మొసలికన్నీరు కార్చుతున్నారని అన్నారు.

14 ఏళ్లు సీఎంగా ఉన్న చంద్రబాబు ప్రధానికి ఎందుకు లేఖ రాయలేకపోతున్నారని రోజా ప్రశ్నించారు.

లేఖ రాస్తే చేసిన తప్పులకు జైల్లో పెడతారన్న భయమా? అంటూ ఎద్దేవా చేశారు. స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సీఎం జగన్ కృతనిశ్చయంతో ఉన్నారని తెలిపారు.

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ కూడా రాశారని వెల్లడించారు.