త్వరలో పెరగనున్న టీవీల ధ‌ర‌లు..!

402
TV prices to go up soon ..!

టీవీలు కొనుగోలు చేసే వారు తొందరపదండి.. ఎందుకంటే వ‌చ్చేనెల నుంచి దేశంలో టీవీల ధ‌ర‌ల‌ను పెంచేందుకు కంపెనీలు సిద్ధ‌మ‌య్యాయి.

గ్లోబ‌ల్ మార్కెట్లో ఓపెన్ సెల్ ప్యానెళ్ల ధరలు 35 శాతం వరకు పెరుగుతుండ‌డంతో భార‌త్ లో టీవీల ధరలు పెరగనున్నాయి.

ఇప్ప‌టికే ఎల్‌జీ కంపెనీ ధ‌ర‌ల‌ను పెంచ‌గా, ప్యానసోనిక్, హాయెర్, థామ్సన్ తో పాటు ప‌లు బ్రాండ్లు వ‌చ్చే నెల నుంచి ధ‌ర‌లు పెంచ‌డానికి సిద్ధ‌మైన‌ట్లు స‌మాచారం.

అంత‌ర్జాతీయంగా ప్యానెల్ ధరలు క్రమం తప్పకుండా పెరుగుతున్నాయ‌ని కంపెనీలు వివరించాయి.

ఈ నేప‌థ్యంలోనే తామూ టీవీ ధరలు పెంచక తప్పట్లేద‌ని ప్యానసోనిక్ ఇండియా, సౌత్ ఆసియా సీఈవో మనీశ్ శర్మ మీడియాకు తెలిపారు.

ఈ ధ‌ర‌లు 5 నుంచి 7 శాతం పెరిగే అవకాశం ఉందని వివ‌రించారు. హాయెర్ అప్లయెన్సెస్ ప్ర‌తినిధులు కూడా ఈ విష‌యాన్నే తెలిపారు.

దేశంలో 32 అంగుళాల టీవీలు అత్య‌ధికంగా అమ్ముడుపోతాయి. వీటి ధరలు రూ.5,000 నుంచి రూ. 6,000 మధ్య పెరిగే అవకాశం ఉంది.