ఎమ్మెల్సీ అభ్యర్థి గా నేడు సురభి వాణీదేవి నామినేషన్‌

162
Today Surabhi Vani Devi MLC Nomination

తెలంగాణలో నేడు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో నామినేషన్లు వేసేందుకు ఆయా పార్టీల నుంచి అభ్యర్థులు సిద్దమవుతున్నారు.

పీవీ నరసింహారావు కుమార్తె సురభి వాణీదేవికి టీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేసే అవకాశం ఇచ్చారు.

ఈ మేరకు సీఎం కేసీఆర్ ఆమె అభ్యర్థిత్వాన్ని ఖరారు చేసిన సంగతి తెలిసిందే. వరంగల్-ఖమ్మం-నల్గొండ స్థానానికి టీఆర్ఎస్ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్ రెడ్డి పేరును ఇప్పటికే ప్రకటించారు.

టీఆర్‌ఎస్‌ పార్టీ మహబూబ్‌నగర్‌-రంగారెడ్డి-హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ అభ్యర్థి గా సురభి వాణిదేవి నేడు నామినేషన్‌ దాఖలు చేయనున్నారు.

ఈ నేపథ్యంలో ఉదయం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మంత్రి కేటీఆర్‌ ప్రగతి భవన్‌లో మూడు ఉమ్మడి జిల్లాలకు చెందిన పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.

పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్లకు ఈ నెల 23 తుది గడువు. మార్చి 14న పోలింగ్ నిర్వహించనున్నారు. మార్చి 17న ఓట్ల లెక్కింపు జరగనుంది.