పది పరీక్షల షెడ్యూల్‌ విడుదల

148

తెలంగాణలో ఎట్టకేలకు పదో తరగతి పరీక్షలకు షెడ్యూల్ విడుదలైంది. మే 17 నుంచి 22 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు విద్యాశాఖ మంగళవారం వెల్లడించింది.

ఈ ఏడాది విద్యార్థులకు ఆరు పేపర్లతో పరీక్షలు నిర్వహించనున్నట్టు స్పష్టం చేసింది.

ఉదయం 9 గంటల 30 నిమిషాల నుంచి మధ్యాహ్నం 12 గంటల 45 నిమిషాల వరకు పరీక్ష సమయం కేటాయించింది.

పరీక్షల షెడ్యూల్‌:

1. మే 17న ప్రథమ భాష (తెలుగు)
2. 18న ద్వితీయ భాష (హిందీ)
3. మే 19న ఇంగ్లిష్‌ పేపర్‌
4. మే 20న మ్యాథ్స్‌ (గణితం)
5. మే 21న సామాన్యశాస్తం
6. మే 22న సాంఘికశాస్త్రం పరీక్షలు నిర్వహించనున్నారు.