ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు టీచర్ల ర్యాలీ

307
Rally of private teachers against government

ట్యూషన్‌ ఫీజును తగ్గిస్తూ కర్ణాటక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్లు భారీ నిరసన కార్యక్రమం చేపట్టారు.

మంగళవారం బెంగళూరులో  రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రైవేటు టీచర్లు, యజమాన్యాలు, భారీ సంఖ్యలో  ర్యాలీలోపాల్గొన్నారు.

కర్ణాటక ప్రైవేటు స్కూల్‌ మేనేజ్‌మెంట్‌, టీచింగ్‌ అండ్‌ నాన్‌ టీచింగ్‌ స్టాఫ్‌ కో ఆర్డినేషన్‌ కమిటీ సంయుక్తంగా ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి.

ఈ విద్యా సంవత్సరం ప్రైవేటు స్కూల్స్‌ ట్యూషన్‌ ఫీజును 70 శాతమే మాత్రమే వసూలు చేయాలని కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకొంది.

ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేటు దాదాపు 3 వేల మంది టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ సిబ్బంది రోడ్లపైకి వచ్చి నిరసనలో పాల్గొన్నారు.

ట్యూషన్‌ ఫీజు తగ్గింపు నిర్ణయాన్ని ప్రభుత్వం వెన‌క్కి తీసుకోవాలని వారు డిమాండ్‌ చేశారు.