మొక్కలు పంపిణీ చేసిన 33 కార్పొరేటర్ దొంత శ్రీనివాస్

579
haritha haram

రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లోని స్థానిక 33 వ డివిజన్ అభివృద్ధిలో భాగంగా హరితహారం ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ డివిజన్ ప్రజలకు మొక్కలు పంపిణీ చేశారు.

కార్పొరేటర్ దొంత శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ సీఎం కేసీఆర్ గారు, ఎమ్మెల్యే కొరకంటి చందర్ గారు, రామగుండం మున్సిపల్ అధికారుల ఆదేశానుసారం డివిజన్ అభివృద్ధిలో భాగంగా హరితహారం కార్యక్రమంలో డివిజన్లోని ప్రజలకు మొక్కలు అందజేయడం తో పాటు వాటిని సంరక్షించాలి అని తెలియజేశారు.

ఈ కార్యక్రమంలో అంగన్వాడి టీచర్లు భాగ్యలక్ష్మి, శ్రీ మాల, నిర్మల, రాజకుమారి, విజయ,డివిజన్ సూపర్వైజర్ ఉమామహేశ్వర్,దొంత సతీష్ మేదరి శ్రీనివాస్,షంషేర్,మొండయ్య ,మరియు డివిజన్ ప్రజలు మహిళలు యువకులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.