
వైద్య సంరక్షణతో క్యాన్సర్ను ఓడించవచ్చని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. గురువారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం సందర్భంగా ఆమె ట్విటర్ వేదికగా స్పందించారు. ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా, శ్రద్ధ తీసుకునేందుకు ఈ క్యాన్సర్ దినోత్సవం రోజున ప్రతిజ్ఞ చేద్దామని పిలుపునిచ్చారు.
సకాలంలో రోగ నిర్ధారణ, సమర్థవంతమైన వైద్య సంరక్షణతో క్యాన్సర్ను ఓడించవచ్చు అని ఆమె పేర్కొన్నారు. క్యాన్సర్ నివారణ, రోగ నిర్ధారణ, చికిత్సను అందరం ప్రోత్సహిద్దామని ఆమె ట్విటర్ లో పేర్కొన్నారు.