![Revanth reddy congress BJP will lose..Rewanth Reddy prophecy](https://telugu.teenmaar.news/wp-content/uploads/2021/02/Revanth-reddy-congress.jpg)
ఎమ్మెల్సీ ఎన్నికలకు ముందే మంత్రి ఈటల పని అయిపోయిందని కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు.
టీఆర్ఎస్ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులపై రేవంత్ విమర్శలు గుప్పించారు.
దుబ్బాక ఎన్నికల్లో హరీశ్ కి సగం చీటీ చినిగిపోయిందని ఎద్దేవా చేశారు. చీటీ మొత్తాన్ని చించడానికే ఇప్పుడు మళ్లీ ఎమ్మెల్సీ ఎన్నికల బాధ్యతలను హరీశ్ కి అప్పగించారన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత హరీశ్ పని అయిపోతుందని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఉద్యోగాల భర్తీపై చర్చకు రాకుండా ఓ విద్యావేత్తను కేటీఆర్ తిట్టించారని ఆయన విమర్శించారు.
కాంగ్రెస్ అభ్యర్థి చిన్నారెడ్డి ఒక విద్యావేత్త అని అన్నారు. రాములు నాయక్ సామాజికవేత్త అని పేర్కొన్నారు.
టీఆర్ఎస్ అభ్యర్థులు మాత్రం విద్యా వ్యాపారవేత్తలని రేవంత్ రెడ్డి దుయ్యబట్టారు.
కాంగ్రెస్ నేత దాసోజు శ్రవణ్ మీదకు దున్నపోతులను కేటీఆర్ ఉసిగొల్పారని విమర్శించారు.
ఉద్యోగ నియామకాలపై మీడియా సమక్షంలో చర్చించేందుకు ఎవరు వచ్చినా చర్చకు తాను సిద్ధమని రేవంత్ సవాల్ విసిరారు.