
తెలంగాణ సీఎం కేసీఆర్ పై నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్ విమర్శనాస్త్రాలు సంధించారు.
కేసీఆర్, కేటీఆర్ ఇద్దరూ ఓటు బ్యాంకు రాజకీయాల్లో మునిగిపోయారని అన్నారు.
ఓట్ల కోసం హిందువుల ప్రాణాలను పణంగా పెడుతున్నారని మండిపడ్డారు. మత్తులో మునిగితేలుతున్న కేసీఆర్ తన మతాన్ని కూడా మర్చిపోయారని అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా భైంసా అల్లర్లపై అరవింద్ స్పందించారు. ఒక ప్రణాళిక ప్రకారమే భైంసాలో హింసాత్మక ఘటనలు జరుగుతున్నాయని అన్నారు.
ఈ హింసకు పాల్పడిన అల్లరిమూకకు జిల్లా కలెక్టర్ ముషారఫ్ అలీ ఫారూకి మద్దతు ఉందని ఆరోపించారు. దీనికి సంబంధించి కేంద్ర నిఘా వర్గాలకు లేఖ రాస్తానని చెప్పారు.
హోం మంత్రి మహమూద్ చేతకాని స్థితిలో ఉన్నారని దుయ్యబట్టారు. లా అండ్ ఆర్డర్ తమకు అప్పచెపితే అల్లర్లను ఎలా కంట్రోల్ చేయాలో చేసి చూపిస్తామని ఆయన వ్యాఖ్యానించారు.
భైంసా అల్లర్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని అరవింద్ డిమాండ్ చేశారు.