ఆలయంలో విగ్రహాల ధ్వంసం

238
Destruction idols in the temple

 

ఇటీవలీ కాలంలో ఏపీలోని పలు ఆలయాలపై దాడులు జరిగిన సంగతి తెలిసిందే. తెలంగాణలో కూడా అలాంటి తరహాలో ఓ దాడి జరిగింది.

నిజామాబాద్ జిల్లాలో మత విశ్వాసాలను దెబ్బతీసే దారుణ సంఘటన చోటుచేసుకొంది.

ఆలయంలోని విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. నవీపేట మండలం ధర్యాపూర్‌లో ఈ సంఘటన జరిగింది.

గ్రామంలో ఎంతో కాలం నుంచి మహాలక్ష్మి మందిరం ఉంది.

ఈ మందిరంలోని చిలుకమ్మ, మంగమ్మ విగ్రహాలను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారు. దీంతో గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు.

నిందితులను వెంటనే పట్టుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు. ఘటనా స్థలానికి చేరుకొన్న పోలీసులు వివరాలు సేకరించారు.

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.