పెరిగిన వంట‌ గ్యాస్ సిలిండర్ ధ‌ర‌లు..నేటి నుంచే అమలు!

129

వినియోగదారులకు గ్యాస్ కంపెనీలు షాకిచ్చాయి. వంట‌ గ్యాస్ సిలిండర్ ధరల‌ను చమురు సంస్థ‌లు భారీగా పెంచాయి. ఈ ఏడాదిలో రాయితీ సిలిండ‌ర్ ధ‌ర‌లు పెరగడం తొలిసారికాగా , నేటి నుంచే పెరిగిన కొత్త రేట్లు అమల్లోకి వచ్చాయి. ఈ మేర‌కు చమురు సంస్థ‌లు నోటిఫికేష‌న్‌ను విడుద‌ల చేశాయి.

రాయితీ సిలిండర్‌పై రూ.25, వాణిజ్య సిలిండర్‌పై రూ.184 పెంచుతూ చమురు సంస్థ‌లు నిర్ణయం తీసుకున్నాయి. దీంతో నిన్న‌టి వ‌ర‌కు ఢిల్లీలో 14.2 కిలోల ఎల్‌పీజీ సిలిండర్‌ ధర రూ.664 ఉండగా ఈ రోజు నుంచి రూ.719కి చేరింది.

హైదరాబాద్‌లో ఇప్పటివరకు రూ.746.50గా ఉన్న ఆ సిలిండ‌ర్ ధ‌ర‌ రూ.771.50కు చేరింది. కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719, చెన్నైలో రూ.735 ఉంది. అలాగే లక్నోలో రూ.757, నోయిడాలో రూ.717, కోల్‌కతాలో రూ.745.50, ముంబైలో రూ.719కి పెరిగింది.