పెళ్లి నిరాకరించిన వరుడు..మనస్తాపంతో యువతి ఆత్మహత్య

222
Farmer suicide jumping flames

పెద్దల సమక్షంలో పెళ్లికి ముహూర్తం ఖరారైంది. లగ్నపత్రికలు కూడా ముద్రించారు.

పెళ్లి వద్దని వరుడు మొండికేయడంతో మనస్తాపానికి గురై చిత్తూరు జిల్లాకు చెందిన యువతి ఆత్మహత్యకు పాల్పడింది.

ఈ ఘటన అమెరికాలోని టెక్సాస్‌లో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. చిత్తూరు పోలీసు కాలనీకి చెందిన సుష్మ (25) అమెరికాలో చదువుకుంటూ ఉద్యోగం చేస్తోంది.

జిల్లాలోని పూతలపట్టు మండలం బందార్లపల్లికి చెందిన భరత్ టెక్సాస్‌లో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌గా పనిచేస్తున్నాడు.

వీరిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చియించిన పెద్దలు లగ్న పత్రికలు కూడా రాయించారు.

అయితే, పది రోజుల క్రితం ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తాయి. ఈ నెల 3న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు.

ఈ క్రమంలో తాను ఈ పెళ్లి చేసుకోలేనని భరత్ తల్లిదండ్రులకు చెప్పడంతో వారు సుష్మ కుటుంబ సభ్యులతో మాట్లాడారు.

కొన్ని రోజులు ఆగితే అన్నీ సర్దుకుంటాయని ఇరు కుటుంబాల వారు ఇద్దరికీ నచ్చజెప్పారు.

ఈ  నేపథ్యంలో తీవ్ర మనస్తాపానికి గురైన సుష్మ సోమవారం ఆత్మహత్యకు పాల్పడింది.

సుష్మ కుటుంబ సభ్యులు చిత్తూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.