మీ కష్టాల్లో పాలు పంచుకుంట 33 వ కార్పొరేటర్ దొంత శ్రీనివాస్

253
dontha srinivas

రామగుండం కమిషనరేట్ పరిధిలో స్థానిక 33వ డివిజన్లో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు గారు, ఎమ్మెల్యే కొరకంటి చందర్ గారు పేదలకు అండ దండ గా ఉండాలని ఇచ్చిన పిలుపు మేరకు డివిజన్లోని నిరుపేదలకు అన్నదాత శ్రీ నీలారపు మమతా మహేందర్ సహకారంతో సుమారు 250 మందికి అన్నదానం కార్పొరేటర్లు దొంత శ్రీనివాస్, Jమౌనిక-రాజు, కొమ్ము వేణు,మాజీ కో-ఆప్షన్ మెంబర్ చెరుకు బుచ్చిరెడ్డి అతిథులుగా విచ్చేసి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.

ఈ సందర్భంగా దొంత శ్రీనివాస్ మౌనిక- రాజు, కొమ్ము వేణు గారు మాట్లాడుతూ నా డివిజన్ లోని ప్రజలు ఆకలితో అలమటించకుండా ఉండాలనే దృఢ సంకల్పంతో ఎమ్మెల్యే కొరకంటి చందర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది నా డివిజన్ ప్రజలకు ఇచ్చిన మాటకు కట్టుబడి కష్టం లో పాలు పంచుకోవడం కోసం అహర్నిశలు కష్టపడుతూ డివిజన్ ప్రజల సేవకు శక్తిని ఇవ్వాలని కోరుకుంటూ ఇలాంటి కార్యక్రమాలు ముందు ముందు చేపడతాం అని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన కార్పొరేటర్లకు విజయమ్మ ఫౌండేషన్ సభ్యులకు అంగన్వాడి టీచర్ల కు కృతజ్ఞతలు తెలియజేశారు.

food for needy

అన్నదాత శ్రీ నీలారపు మమతా మహేందర్ సహకారంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో విజయమ్మ ఫౌండేషన్ సభ్యులు అంగన్వాడీ టీచర్లు శ్రీ మాల, భాగ్యలక్ష్మి,శ్రీలత నిర్మల,లెనిన్,దొంత సతీష్, మేదరి శ్రీను చిన్న శ్రీను సంజీవ్,యుగంధర్ రహీం,ప్రశాంత్, వెంకట్,ఆకుల రవి,నరేష్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

33 division