తెలంగాణలో కొత్తగా 177 కోవిడ్ కేసులు

149

గత కొద్ది నెలలుగా జనాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న కరోనా మహమ్మారి తెలంగాణలో తగ్గుముఖం పట్టినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో
గత 24 గంటల్లో కొత్తగా 177 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ఈ రోజు ఉదయం వెల్లడించిన వివరాల ప్ర‌కారం… గత 24 గంటల్లో కరోనాతో ఇద్ద‌రు మరణించారు. అదే సమయంలో 198 మంది కోలుకున్నారు.

ఇప్పటివరకు రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 2,95,101 కి చేరింది. 2,91,510 మంది వైరస్ నుంచి కోలుకున్నారు. మృతుల సంఖ్య 1,606కి పెరిగింది. ప్రస్తుతం 1,985 మంది ఆయా ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారిలో 776 మంది హోం క్వారంటైన్ లో చికిత్స తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలో కొత్తగా 30 కరోనా కేసులు నమోదైనట్టు వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది.