త్వరలో మార్కెట్లోకి కరోనా వ్యాక్సిన్!

186
Two elderly people died corona vaccine

దేశవ్యాప్తంగా జనవరి 16న ప్రారంభమయిన కరోనా వ్యాక్సినేషన్ కార్యక్రమం వేగంగా కొనసాగుతోంది.

తొలి దశ టీకా లక్ష్యాలు పూర్తయిన అనంతరం బహిరంగ మార్కెట్లోకి టీకా అందుబాటులోకి వస్తుందని ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణ్‌దీప్ గులేరియా తెలిపారు.

కరోనా టీకా రెండో డోస్ తీసుకున్న గులేరియా అనంతరం మాట్లాడుతూ ఈ ఏడాది చివరి నాటికి కరోనా టీకా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్నారు.

అప్పుడు సాధారణ ప్రజలు కూడా వ్యాక్సిన్‌ను కొనుగోలు చేసుకోవచ్చన్నారు. సీరం ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనావాలా మాట్లాడుతూ.. మార్చి, ఏప్రిల్ నాటికే కరోనా టీకా మార్కెట్లోకి అందుబాటులోకి వస్తుందన్నారు.

వ్యాక్సినేషన్ లో భాగంగా దేశంలోని 30 కోట్ల మందికి టీకా ఇవ్వాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.

వ్యాక్సినేషన్ డ్రైవ్ ప్రారంభమైన తర్వాత నెల రోజుల్లో 90 లక్షల మందికి టీకాలు వేశారు.