ప్రభుత్వ హాస్టల్ లో 232 మంది విద్యార్థులకు కరోనా!

208
Corona to the staff .. Restaurant‌ siege

మహారాష్ట్రలో కరోనా విజృంభించడంతో మళ్లీ కేసులు శరవేగంగా పెరుగుతున్నాయి. రాష్ట్రంలో గురువారం రికార్డు స్థాయిలో 8,807 కొత్త కేసులు నమోదయ్యాయి.

కరోనా తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఇటీవలే స్కూళ్లు, కాలేజీలకు మహారాష్ట్ర ప్రభుత్వం కూడా అనుమతినిచ్చింది.

వాటితోపాటే హాస్టళ్లూ కూడా తెరుచుకున్నాయి. ఈ క్రమంలూ 327 మంది విద్యార్థులు చదువుకుంటున్న ఓ హాస్టల్ లో 200 మందికిపైగా కరోనా సోకింది.

వాషిం జిల్లాలోని ఓ ప్రభుత్వ హాస్టల్ లో విద్యార్థులు, సిబ్బంది సహా 232 మందికి కరోనా భారీన పడ్డారు.

అందులో ముగ్గురు సిబ్బంది ఉన్నట్టు తెలుస్తోంది. మిగతా వారంతా విద్యార్థులేనని అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఆ స్కూల్ ప్రాంతాన్ని కంటెయిన్మెంట్ జోన్ గా ప్రకటించారు.

వెంటనే పాజిటివ్ వచ్చిన వారిని ఆస్పత్రికి తరలించారు. పాజిటివ్ వచ్చిన విద్యార్థులంతా అమరావతి, హింగోలి, నాందేడ్, వాషిం, అకోలా, ముల్దానా ప్రాంతాలకు చెందిన వారిగా తెలుస్తోంది.