పెట్రోల్‌కు బదులుగా బ్యాటరీ ఇంజన్

246

చ‌మురు ధ‌ర‌లు పెరిగిపోతున్న నేప‌థ్యంలో జ‌నాలు వివిధ ర‌కాలుగా ఆలోచిస్తున్నారు. పెట్రోల్ బాదుడు నుంచి త‌ప్పించుకునేందుకు మార్గాల‌ను అన్వేషిస్తున్నారు.

కొందరు తమ వాహనాలను అమ్ముకుంటుంటే మరికొందరు పెట్రో భారం నుంచి తప్పించుకునేందుకు రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు.

ద్విచక్ర వాహనదారులు ఒక కొత్త ఆలోచ‌న చేశారు. బైక్ పెట్రోల్ ఇంజిన్‌లను బ్యాటరీ ఇంజిన్‌లుగా మారుస్తున్నారు.

విద్యుత్ కార్లు ఇప్ప‌డిప్పుడే అందుబాటులోకి వ‌స్తున్నాయి. అదే మాదిరిగా బైక్‌ల‌ను కూడా మారిస్తే బాగుంటుంది క‌దా అనుకుంటున్నారు.

ఇలాంటి వాహనాల ఫొటోలను చాలామంది సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. వారు పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్ ఇంజిన్‌గా మారుస్తున్నామంటూ పేర్కొంటున్నారు.

దీనికోసం సుమారు 10 వేల రూపాయలు ఖర్చవుతుందని చెబుతున్నారు. బ్యాటరీని బ‌ట్టి ఛార్జీల ధర మారుతుందని చెబుతున్నారు. కానీ వేగం మాత్రం గంటకు 65-70 కి.మీ. ప్రయాణించవచ్చని వెల్లడిస్తున్నారు.

పెట్రోల్ ఇంజిన్‌ను ఎలక్ట్రిక్‌గా మార్చేటప్పుడు గేర్ బాక్స్ తొలగించి, యాక్సిలరేటర్ నుంచి అనుసంధానం చేస్తారని చెబుతున్నారు. యాక్సిలేటర్ ద్వారా వాహనాన్ని నియంత్రించవచ్చని తెలుపుతున్నారు.

అంటే స్కూటీ లాగా పని చేస్తుందని చెబుతున్నారు. ఇలా మీ బండిని మార్చి 2 గంటలపాటు బ్యాటరీని ఛార్జ్ చేసుకుంటే 40 కిలోమీటర్లు నడపవచ్చు.

దీంతోపాటు బ్యాటరీ పూర్తిగా ఛార్జ్ అయితే బైక్ 300 కి.మీ వరకు ప్రయాణించవచ్చ‌ని అంటున్నారు. అది పూర్తిగా బ్యాటరీపై ఆధారపడి ఉంటుందని పేర్కొంటున్నారు.

ఇలా చేయ‌డం చట్టవిరుద్ధమని కేసులు నమోదవుతాయని పోలీసులు హెచ్చరిస్తున్నారు. మోటారు వాహన చట్టం 1988లోని సెక్షన్ 52 ప్రకారం ఏదైనా మోటారు వాహనంలో పరికరాలను మార్చడం చట్టపరమైన నేరం.

దీని ప్రకారం వాహనాన్ని మార్చరాదు. అలా చేస్తే మీపై చట్టపరమైన చర్య‌లు తీసుకోవ‌డంతో ప‌నాటు జరిమానా విధిస్తారు. అంతేకాకుండ మీ భీమాను కూడా క్యాన్సెల్ చేస్తారు.