రేషన్ పరేశాన్.. ఆధార్ కేంద్రాల ‌వ‌ద్ద ప్ర‌జ‌లు బారులు!

121
adhaar Centre Telangana

తెలంగాణ‌ ప్రభుత్వం ఈ నెల నుంచి రేషన్‌ దుకాణాల్లో బయోమెట్రిక్‌ విధానాన్ని రద్దు చేసింది. ఇకపై రేషన్‌ సరుకులు తీసుకోవాలంటే లబ్ధిదారులు తమ సెల్‌ఫోన్లకు వచ్చిన ఓటీపీ చూపించాల‌ని కొత్త నిబంధ‌న తీసుకొచ్చారు. తెల్ల రేషన్‌ కార్డు లబ్ది దారులు త‌మ‌ సెల్‌ ఫోన్‌ నంబర్‌ను ఆధార్‌కార్డుతో అనుసంధానం చేసుకోవాలని సూచించింది. ఈ విధానం అమల్లోకి రావ‌డంతో ఆధార్-సెల్‌ఫోన్ నంబ‌రు అనుసంధానం లేని లబ్ది దారులు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. ఆధార్‌కార్డుకు తమ ఫోన్ నెంబర్ లింక్ చేసుకునేందుకు ఆధార్ కేంద్రాల వ‌ద్ద రేష‌న్ కార్డుదారులు బారులు తీరుతున్నారు.

ఈ రోజు ఉద‌యం నుంచే పలు జిల్లాల్లో ప్రజలు ఆధార్ కేంద్రాల వ‌ద్ద‌కు చేరుకుని క్యూలో నిల‌బ‌డ్డారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రం‌లో ఆధార్ సెంట‌ర్ వ‌ద్ద స్థానికులు భారీ సంఖ్యలో బారులు తీరారు. ఒక్క‌సారిగా ప్ర‌జ‌లు అధిక సంఖ్య‌లో వ‌స్తుండ‌డంతో ఆధార్ కేంద్రాల సిబ్బంది ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. సంగారెడ్డి జిల్లా నారాయ‌ణ‌ఖేడ్‌లో ఆధార్ కేంద్రాన్ని సిబ్బంది తెర‌వ‌డం లేద‌ని స్థానికులు రోడ్డుపై బైఠాయించారు. దీంతో కాసేపు రాకపోకలకు అంతరాయమేర్పడింది. రాష్ట్రవ్యాప్తంగా ప‌లు జిల్లాలలో వృద్ధులు, మ‌హిళ‌లు ఉద‌యం నుంచే ఆధార్ కేంద్రాల వ‌ద్ద నిల‌బ‌డ్డారు.