దేశంలో కొత్త‌గా 15,510 కోవిడ్ కేసులు

208
Corona to the staff .. Restaurant‌ siege

దేశంలో గత 24 గంటల్లో 15,510 మందికి కరోనా నిర్ధారణ అయినట్టు ఆరోగ్య వెల్లడించింది.

కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ రోజు ఉదయం విడుదల చేసిన గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,10,96,731 కు చేరింది.

గడచిన 24 గంట‌ల సమయంలో 106 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,57,157 కు పెరిగింది.

దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 1,07,86,457 మంది కోలుకున్నారు.1,68,627 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స పొందుతున్నారు.

ఇప్ప‌టివ‌ర‌కు 1,43,01,266 మందికి వ్యాక్సిన్ వేశారు. దేశవ్యాప్తంగా నిన్నటి వరకు మొత్తం 21,68,58,774 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది.

నిన్న ఒక్కరోజే 6,27,668 నమూనాలను పరీక్షించినట్లు వెల్లడించింది.