ముఖేష్ అంబానీకి బెదిరింపు లేఖ!

155
Threatening letter to Mukesh Ambani!

ప్రముఖ పారిశ్రామికవేత్త ముఖేష్‌ అంబానీ నివాసం ఆంటిలియా వద్ద పేలుడు పదార్థాలతో ఉన్న స్కార్పియో కారును పోలీసులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఈ కారులో ఆగంతకుడు రాసిన ఓ లేఖను ముంబై పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులోని వివరాలను శుక్రవారం వెల్లడించారు.

ఆగంతకుడు ఇంగ్లీష్ లో లేఖను రాశాడని, ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీలను ఉద్ధేశించి బెదిరింపులకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు.

ఈ పేలుడు పదార్థాలున్న కారును మీ ఇంటి సమీపంలో వదిలివేయడం కేవలం ట్రైలర్ మాత్రమేనని ఆగంతకుడు లేఖలో బెదిరించాడని పోలీసులు తెలిపారు.

అంబానీ కుటుంబం మొత్తాన్ని అంతం చేయడానికి ఈసారి పక్క ప్లాన్ తో వస్తానని బెదిరించినట్టు తెలిపారు.

పేలుడు పదార్థాలతో లభ్యమైన వాహనం నెంబరు కొన్ని ముఖేశ్‌ అంబానీ కాన్వాయ్ కారు నంబర్‌ ప్లేట్లతో మ్యాచ్‌ అయ్యాయని పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో ముఖేష్ అంబానీ నివాసమున్న ప్రాంతంలో భద్రతను పెంచారు.

గాందేవీ పోలీసు స్టేషన్ పరిధిలోని కార్మికెల్ రోడ్‌లో అనుమానాస్పదంగా ఉన్న వాహనాన్ని గుర్తించిన పోలీసులు వెంటనే అప్రమత్తమాయ్యారు.

బాంబు స్క్వాడ్‌ను రంగంలోకి దిగి క్షుణ్ణంగా పరిశీలించి అందులో పేలుడు పదార్థాలున్నట్టు గుర్తించారు.