మంత్రి గ్రీన్ ఛాలెంజ్ ను స్వీకరించి మొక్కలు నాటిన ఎస్పీ రంగనాధ్

540
Nalgonda SP

పర్యావరణ పరిరక్షణను ఒక సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే దాని ఫలితాలు లభిస్తాయని జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ అన్నారు. విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి విసిరిన గ్రీన్ ఛాలెంజ్ స్వీకరించిన జిల్లా ఎస్పీ ఏ.వి.రంగనాధ్ జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో అదనపు ఎస్పీ డిటిసి సతీష్ చోడగిరి, డిఎస్పీలు వెంకటేశ్వర్ రెడ్డి, రమణారెడ్డిలతో కలిసి మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని అన్నారు. మొక్కలు నాటడం ద్వారా పచ్చదనం పెంపొందడంతో పాటు పర్యావరణ కాలుష్యం తగ్గి మానవాళి మనుగడలో కీలకపాత్ర వహిస్తాయని చెప్పారు. జిల్లా పోలీసు కార్యాలయంతో పాటు జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్ల ఆవరణలో పచ్చదనం పెంపొందించేలా విస్తృతంగా మొక్కలు నాటుతున్నామని చెప్పారు.

మంత్రి జగదీష్ రెడ్డి విసిరిన ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటిన ఆయన డిటిసి అదనపు ఎస్పీ సతీష్ చోడగిరి, నల్లగొండ డిఎస్పీ వెంకటేశ్వర్ రెడ్డి, ఎస్.బి. డిఎస్పీ రమణారెడ్డిలకు గ్రీన్ ఛాలెంజ్ చేయగా స్పందించిన వారు వెంటనే మొక్కలు నాటి ఇతర పోలీస్ అధికారులకు గ్రీన్ ఛాలెంజ్ చేశారు. కార్యక్రమంలో ఆర్.ఐ.లు వై.వి. ప్రతాప్, నర్సింహా చారి, స్పర్జన్ రాజ్, సిఐలు బాషా, నాగేశ్వరరావు, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.