తిరుపతి నుండి ఆరు ప్రత్యేక రైళ్లు

1245
six-special-trains-from-tirupati


 

తిరుపతికి పెరుగుతున్న రద్దీ దృష్ట్యా దక్షిణ మధ్య రైల్వే 6 ప్రత్యేక రైళ్లను నడపనుంది. వీటిలో తత్కాల్‌ చార్జీలు అమలు చేస్తున్నట్లు రైల్వే కమర్షియల్‌ అధికారులు తెలిపారు.

07608 నంబర్‌తో నడిచే రైలు ప్రతి బుధవారం మధ్యాహ్నం 3.45 కు తిరుపతిలో బయలుదేరి గూడురు, విజయవాడ, సికింద్రాబాద్‌ మీదుగా నాందేడు వరకు నడుస్తుంది.

07146 నంబర్‌తో నడిచే రైలు ప్రతి గురువారం సాయంత్రం 5కు తిరుపతిలో బయలుదేరి గూడురు, విజయవాడ, ఖాజీపేట మీదుగా కాచిగూడ వరకు నడుస్తుంది.

07417 నంబర్‌తో నడిచే రైలు ప్రతి శుక్రవారం ఉదయం 7.30కు తిరుపతిలో బయలుదేరి గూడురు, తెనాలి, గుంటూరు, సికింద్రాబాద్‌ మీదుగా నాగర్‌సోల్‌(షిరిడీ సమీపం) వరకు నడుస్తుంది.

08574 నంబర్‌తో నడిచే రైలు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 3.30కు తిరుపతిలో బయలుదేరి గూడూరు, విజయవాడ మీదుగా విశాఖపట్నం వరకు నడుస్తుంది.