ఉద్యోగుల‌కు శుభ‌వార్త‌

207

ఉద్యోగులకు నిజంగా ఇది శుభ‌వార్తే అని చెప్పాలి. ఎందుకంటే కరోనా కారణంగా గతేడాది వేలాది మంది ఉద్యోగాలు కోల్పోయారు.

చాలా కంపెనీలు తమ ఉద్యోగులను నిర్మోహమాటంగా బయటకు పంపించేశాయి. లాక్‌డౌన్ వ‌ల్ల ఆర్థిక లావాదేవీలు పూర్తిగా త‌గ్గిపోవ‌డం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలు కుప్ప కూలాయి.

ఇది అన్ని రంగాలపై ప్రభావం చూపింది. అయితే ఇప్పుడిప్పుడే పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయి.

వ్యాక్సిన్‌ అందుబాటులోకి రావడం, కరోనా తీవ్రత కూడా తగ్గుతుండడంతో మళ్లీ ఆర్థిక వ్యవస్థలు పుంజుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఈ ఏడాది చాలా కంపెనీలు తమ ఉద్యోగులకు జీతాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నాయని ఓ సర్వేలో తేలింది.

భారతదేశానికి చెందిన పలు కంపెనీలు ఉద్యోగులకు ఈ ఏడాది సగటు వేతన పెంపు 7.3 శాతం ఉండొచ్చని డెలాయిట్ అనే సంస్థ త‌న నివేదికలో తెలిపింది.

ఏడు రంగాలు, 25 ఉప రంగాలకు చెందిన 400 సంస్థలు ఈ సర్వేలో పలు అంశాల‌పై త‌మ అభిప్రాయాల‌ను తెలియ‌జేశాయి.. దీని ప్రకారం.. సుమారు 92 శాతం కంపెనీలు ఈ ఏడాది తమ ఉద్యోగులకు జీతాలు పెంచనున్నట్లు తెలిసింది.

అయితే గతేడాది ఇది కేవలం 60 శాతం మాత్రమే ఉండింది. ఇక సుమారు 20 శాతం కంపెనీలు రెండంకెల స్థాయిలో జీతాలు పెంచేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపాయి.

గతేడాది మొత్తానికే ఇంక్రిమెంట్‌ ఇవ్వని కంపెనీలు ఈ ఏడాది అధికంగా వేతనాలు పెంచడం లేదా బోనస్‌ అందించాలని యోచిస్తున్న‌ట్టు ప్రక‌టించాయి. లైఫ్‌ సైన్సెస్‌, ఐటీ రంగ కంపెనీలు అధిక ఇంక్రిమెంట్‌లు ఇచ్చే అవకాశం ఉన్నట్లు సర్వేలో వెల్ల‌డైంది.