వేలం పాటలో వైన్‌షాప్‌కు రూ.510 కోట్లు

214
Rs 510 crore for wine shop in auction

రాజ‌స్థాన్ ప్ర‌భుత్వం కొత్త మ‌ద్యం పాల‌సీని తీసుకొచ్చింది. దీని ప్ర‌కారం వైన్‌షాప్‌ల‌ను లాట‌రీలో కాకుండా వేలం వేయాల‌ని నిర్ణ‌యించారు.

దీంతో అక్కడి ప్రభుత్వ ఖజానాకు భారీగా ఆదాయం వచ్చింది. నుమాన్‌గ‌ఢ్ జిల్లా నోహ‌ర్‌లోని ఓ వైన్‌షాప్‌కు ఈ-వేలం వేశారు.

గతంలో నిర్వహించిన లాట‌రీలో కేవ‌లం రూ.65 ల‌క్ష‌ల‌కే పోయిన ఈ వైన్‌షాప్ ఈసారి మాత్రం భారీ మొత్తాన్ని సొంతం చేసుకుంది.

ఉద‌యం 11 గంట‌ల‌కు మొద‌లైన ఈ ఈ-వేలం అర్ధ‌రాత్రి 2 గంట‌ల‌కు ముగిసింది.

చివ‌రికి రూ.510 కోట్ల ధ‌ర ప‌ల‌క‌డం విశేషం. కిర‌ణ్ క‌న్వ‌ర్ అనే వ్య‌క్తి ఈ షాప్‌ను సొంతం చేసుకున్న‌ట్లు ఎక్సైజ్ అధికారులు వెల్ల‌డించారు.

బేస్‌ప్రైస్ కంటే ఇది ఏకంగా 708 రెట్లు ఎక్కువ కావ‌డం గ‌మ‌నార్హం. మూడు రోజుల్లో ఈ బిడ్డింగ్ మొత్తంలో రెండు శాతాన్ని బిడ్డ‌ర్ చెల్లించాల్సి ఉంటుంది. ఒక‌వేళ అత‌డు చెల్లించ‌లేక‌పోతే రూ.ల‌క్ష డిపాజిట్‌ను తిరిగి చెల్లించరు.