
దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ నిన్న ప్రారంభమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా టీమిండియా కోచ్ రవిశాస్త్రి కరోనా టీకా తీసుకున్నారు.
మంగళవారం గుజరాత్ లోని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రిలో శాస్త్రి మొదటి డోసు తీసుకున్నారు.
ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ లో పంచుకున్నారు. టీకా తీసుకుంటున్న ఫొటోను పోస్ట్ చేశారు.
తాను వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు రవిశాస్త్రి చెప్పాడు. ఈ సందర్భంగా కరోనాకు వ్యతిరేకంగా కృషి చేసిన ఆరోగ్య సిబ్బంది, సైంటిస్టులకు అతడు కృతజ్ఞతలు తెలిపారు.
వ్యాక్సినేషన్ రెండో దశలో భాగంగా 60 ఏళ్లు దాటిన వారితోపాటు దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న 45 ఏళ్లు పైబడిన వారికి వ్యాక్సిన్ ఇస్తున్న విషయం తెలిసిందే.
ప్రధాని మోదీతోపాటు ఇప్పటికే దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు వ్యాక్సిన్ తీసుకున్నారు.