ఇంజ‌న్ నుంచి విడిపోయిన బోగీలు

228

స్టేష‌న్ ఘ‌న్‌పూర్‌లో జ‌రిగిన ఘ‌ట‌న ఏదైనా షూటింగ్ కోసం జ‌రిగిందా? అన్న‌ట్టుంది.

ఎందుకంటే సినిమాల్లో పట్టాలపై వేగంగా వస్తున్న రైలు సడన్‌గా ఆగిపోవడం. లేదంటే మధ్యలోనే ఇంజన్‌, బోగీలు రెండుగా విడిపోవడం, రైలు పట్టాలపై హెలికాఫ్టర్ దిగ‌డం లాంటి దృశ్యాల‌ను సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం.

కానీ ఇది మాత్రం రియల్‌గానే జరిగింది. రన్నింగ్‌లో ఉన్న రైలు ఒకటి పట్టాలపై రెండుగా విడిపోయింది.

దీంతో అందులో ప్రయాణిస్తున్న వారంతా తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. ఈ ఘటన జనగామ జిల్లాలో చోటు చేసుకుంది.

దానాపూర్ వెళ్లే 2791 నెంబర్ గల దానాపూర్ ఎక్స్ ప్రేస్ రైలు సికింద్రాబాద్ స్టేషన్ నుండి బయల్దేరింది.

స్టేషన్ ఘనపూర్‌లోని రైల్వే గేటు దాటాక ఇంజన్, బోగీలను కలిపే లింకు ఉడిపోయింది. దీంతో బోగీలు లేకుండా ఇంజన్ దాదాపు 250 మీటర్ల వరకు వెళ్లిపోయింది.

అందులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. అయితే ఇది గ‌మ‌నించిన వెంటనే రైల్వే స్టేషన్ సిబ్బంది పరిస్థితిని చక్కదిద్దారు.

ఇంజన్, బోగీలను మరోసారి లింక్ చేసి రైలును యథావిధిగా పంపించారు. ఈ ఘటనతో స్టేషన్ ఘనపూర్‌లో రైలు అరగంట పాటు నిలిచిపోయింది.

ఉదయం 10:54 నుండి 11:22 అంటే సుమారు 28 నిమిషాల పాటు రైల్వే గేట్‌లోనే ట్రైన్ ఆగిపోయింది.

ఆ తర్వాత మరమ్మతులు పూర్తయ్యాక రైలు బయల్దేరడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.