పోలీసులు టీఆర్‌ఎస్‌ నేతలకు వత్తాసు: ఉత్త‌మ్‌

190
Police support to TRS leaders:Uttam

తెలంగాణ గవర్నర్‌ను ఈ రోజు టీ కాంగ్రెస్‌ నేతలు కలిశారు. లాయర్ వామ‌న‌రావు దంపతుల హత్యపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని గవర్నర్‌ కు విజ్ఞ‌ప్తి చేశారు.

అనంత‌రం కాంగ్రెస్ నేత ఉత్త‌మ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఓ కేసులో హైకోర్టులో పిటిష‌న్‌ వేసినందుకే వారిని హత్య చేశారన్నారు.

ఈ కేసులో పోలీసులు స్థానిక టీఆర్‌ఎస్‌ నేతలకు వత్తాసు పలుకుతున్నారని ఉత్తమ్ ఆరోపించారు.

ఈ ఘ‌ట‌న‌పై కేసీఆర్ ఎందుకు స్పందించ‌ట్లేద‌ని ఉత్తమ్‌ ప్ర‌శ్నించారు. ఈ కేసులో పుట్టా మధుకు స్థానిక పోలీసు కమిషనర్‌ తొత్తుగా వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు.

లాయర్ దంపతుల హత్య కేసులో ప్రభుత్వంపై త‌మకు నమ్మకం లేదని అన్నారు. కేసీఆర్‌కు పుట్టా మధు సన్నిహితుడని ఆయ‌న చెప్పారు.

ఈ కేసులో నేరుగా కోర్టు ద్వారానే విచారణ జరిపించాలని గవర్నర్‌ను కోరామని తెలిపారు.

ఈ విష‌యంపై సీజేఐతో పాటు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, రాష్ట్రపతి కోవింద్‌కు లేఖ రాశామని ఉత్తమ్ వెల్లడించారు.