కరోనా వ్యాక్సిన్ వేయించుకున్న ప్రధాని మోదీ

161
PM Modi took Corona Vaccine

నేడు దేశవ్యాప్తంగా రెండో దశ కరోనా వ్యాక్సినేషన్ ప్రారంభమైంది. ఇందులో భాగంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఢిల్లీలోని ఎయిమ్స్‌లో కరోనా టీకా మొదటి డోసు వేయించుకున్నారు.

దేశీయంగా తయారైన భారత్ బయోటెక్‌కు చెందిన కొవాగ్జిన్ టీకాను ప్రధాని తీసుకున్నారు.

ఎయిమ్స్‌ సిస్టర్‌ పీ. నివేదా ప్రధానికి సిరంజీ ద్వారా టీకా ఇచ్చారు. ఈ సందర్భంగా కరోనాపై వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషిని ప్రధాని కొనియాడారు.

ప్రపంచవ్యాప్తంగా కరోనాకు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటాన్ని బలోపేతం చేయడానికి వైద్యులు, శాస్త్రవేత్తలు చేస్తున్న కృషి ప్రశంసనీయమైనదని కొనియాడారు.

అర్హులైన ప్రతి ఒక్కరు కొవిడ్‌ టీకా వేయించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నామని తెలిల్పారు. మనమంతా సమష్టి కృషితో భారత్‌ను కరోనా రహిత దేశంగా మారుద్దామన్నారు.

కరోనా టీకా తీసుకున్న విషయాన్ని మోదీ.ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అందరం కలిసి దేశాన్ని కొవిడ్ రహితంగా తీర్చిదిద్దుదామని పిలుపునిచ్చారు.