ఫోన్ పే ఉద్యోగులకు బంపర్ ఆఫర్ .. రూ.3 లక్షల షేర్ల బదలాయింపు!

154
phonepe app

డిజిటల్ చెల్లింపుల సంస్థ ఫోన్ పే తన ఉద్యోగులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. వారిలో మరింత ఉత్సాహం నింపేందుకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల విలువైన షేర్లను బదలాయించింది.

కంపెనీలోని అన్ని స్థాయుల్లో ఉన్న 2,200 మంది ఉద్యోగులకు వర్తించేలా ఈ నిర్ణయం తీసుకుంది. అందుకోసం రూ.1,500 కోట్లను విలువైన షేర్లను ఉద్యోగులకు బదలాయించింది.

గతేడాది డిసెంబరులో ఫ్లిప్ కార్ట్ నుంచి విడిపోయి స్వతంత్ర సంస్థగా అవతరించైనా ఫోన్ పే ఈ కీలక నిర్ణయం తీసుకొంది. తాజా షేర్ల బదలాయింపుతో ఉద్యోగులను కూడా యాజమాన్యంలో భాగస్వాములను చేసినట్టయింది. ఈ మేరకు ఫోన్ పే వర్గాలు ప్రకటన చేశాయి. ఉద్యోగులు భవిష్యత్తులో లాభసాటి అనిపించినప్పుడు ఈ షేర్లను అమ్ముకునే అవకాశముంటుంది.

ఈ నేపథ్యంలో ఫోన్ పే సహవ్యవస్థాపకుడు, సీఈవో సమీర్ నిగమ్ ట్విట్టర్ లో స్పందించారు. ఫోన్ పే వ్యవస్థాపకులుగా రాహుల్ చారి, నేను అద్భుతమైన భావోద్వేగాలకు గురవుతున్నామని పేర్కొన్నారు. సంపదను పంచుకోవడంతో మాలో ఆనందం వెల్లువిరుస్తోందని వెల్లడించారు.