కేసీఆర్ చెప్పినవాళ్లకే పీసీసీ అధ్యక్ష పదవి: ఎంపీ అరవింద్

144
KCR forgot religion in intoxication: MP Arvind

తెలంగాణ కాంగ్రెస్‌లో కేసీఆర్ చెప్పినవాళ్లకే పీసీసీ అధ్యక్ష పదవి వస్తుందని నిజామాబాద్ బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ ఆరోపించారు.

ఆ రెండు పార్టీల‌కు మ‌ధ్య సంబంధం ఉంద‌ని ఆయన చెప్పుకొచ్చారు. పెద్దపల్లి జిల్లాలో జరిగిన న్యాయవాది వామన్ రావు దంప‌తుల‌ హత్యను ఖండిస్తున్నామ‌ని తెలిపారు.

టీఆర్ఎస్‌ ప్రభుత్వం పై విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్‌ను బొంద పెట్టే వరకు నిద్రపోమని అరవింద్ వ్యాఖ్యానించారు.

రాష్ట్రంలో దొంగ పాస్ పోర్టుల వ్యవహారం హిందువులను ఆందోళ‌న‌ల‌కు గురి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

రోహింగ్యాల పాస్ పోర్టు జారీకి నైతిక బాధ్యత వహిస్తూ పోలీస్ కమిషనర్ రాజీనామా చేయాలని ఆయ‌న అన్నారు.

ముస్లింల ఓట్ల శాతాన్ని పెంచేందుకే నిజామాబాద్ సీపీ కార్తికేయకు పోస్టింగ్ ఇచ్చారని ఆరోపించారు.

ఆయ‌న‌కు మ‌రో చోటకు పదోన్నతి వచ్చినప్ప‌టికీ కార్తికేయ నిజామాబాద్ జిల్లాను వదలడం లేదన్నారు.