టీడీపీ పంచాయతీ ఎన్నికల మేనిఫెస్టో రద్దు!

122
Tdp Andhra pradesh

ఏపీలో పంచాయితీ ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో ఎన్నడూలేని విధంగా టీడీపీ మేనిఫెస్టో విడుదల చేసింది. పార్టీలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికల కోసం టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోను రద్దు చేస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.

పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పల్లె ప్రగతి-పంచ సూత్రాలు పేరిట తెలుగుదేశం పార్టీ ఈ మేనిఫెస్టో తీసుకువచ్చింది. అయితే, ఈ మేనిఫెస్టో రాజ్యాంగ విరుద్ధం అంటూ అనేక విమర్శలు వచ్చాయి. దీనిపై వైసీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, పార్టీ లీగల్ సెల్ ప్రతినిధులు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. స్పందించిన రాష్ట్ర ఎన్నికల సంఘం టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది.