తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదు: షర్మిల

190
Same name for YS Sharmila's party!

తెలంగాణలో కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేసేందుకు వైయస్ షర్మిల కసరత్తు ముమ్మరం చేసింది.

దివంగత వైయస్ అభిమానులతో ఆమె జిల్లాల వారీగా వరుస సమావేశాలు నిర్వహించింది. మరోవైపు పలువురు నేతలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కూడా ఆమెను కలిసి తమ సంఘీభావాన్ని ప్రకటించారు.

ప్రస్తుతం పార్టీని నిర్మించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. ఇందులో భాగంగా యువతపై షర్మిల దృష్టి సారించారు.

రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన విద్యార్థులతో ఈరోజు లోటస్ పాండ్ లో షర్మిల సమావేశమయ్యారు.

ఈ సమావేశంలో దాదాపు 300 మంది విద్యార్థులు పాల్గొన్నట్టు తెలుస్తోంది.ఈ సందర్భంగా విద్యార్థులతో షర్మిల మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగ నోటిఫికేషన్లు రావడం లేదని ఆమె అన్నారు.

ఇప్పుడు ఎంతో మంది నిరుద్యోగులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు.

అందరి నిరీక్షణ ఫలించాలంటే మంచి సమాజం రావాల్సి ఉందని అన్నారు. మీ అక్కగా ఈ సమాజాన్ని బాగు చేసేందుకు తాను ప్రయత్నిస్తున్నానని చెప్పారు.

తెలుగు ప్రజలను దివంగత వైయస్సార్ గుండెల్లో పెట్టుకుని చూసుకున్నారని అన్నారు.

వైయస్సార్ హయాంలో ఫీజు రీయింబర్స్ మెంట్ పథకం ద్వారా వెయ్యి రూపాయలుచెల్లిస్తే, మిగతా ఫీజును ప్రభుత్వం భరించేదని అన్నారు.

ప్రతి జిల్లాకు యూనివర్శిటీని తీసుకొచ్చిన ఘనత వైయస్సార్ దేనని షర్మిల అన్నారు.

ఆయన హయాంలో చదువుకున్న ఎందరో విద్యార్థులు ఇప్పుడు పెద్దపెద్ద ఉద్యోగాలు చేస్తున్నారని తెలిపారు.