మొతేరా స్టేడియంకు మోదీ పేరు..రాహుల్ గాంధీ విమర్శలు

245
Tamil BJP Complaints Rahul to EC

గుజరాత్ లోని అహ్మదాబాద్ లో నిర్మించిన అతిపెద్ద క్రికెట్ స్టేడియంకు ప్రధాని మోదీ పేరు పెట్టడంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

ప్రపంచంలోనే అతిపెద్ద క్రికెట్ స్టేడియంగా పేరుగాంచిన దీని అసలు పేరు సర్దార్ వల్లభాయ్ పటేల్ స్టేడియంగా నామకరణం చేశారు.

అయితే ఈ స్టేడియంను పునర్నిర్మించిన తర్వాత మోదీ పేరు పెట్టారు.ఈ స్టేడియంను ఈరోజు రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ ప్రారంభించారు.

ఈ కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీసీసీఐ కార్యదర్శి జై షా, కేంద్ర క్రీడాశాఖ మంత్రి కిరణ్ రిజిజు పాల్గొన్నారు.

అనారోగ్యంతో బాధపడుతున్న కారణంగా ఈ కార్యక్రమానికి బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ హాజరుకాలేదు.

ఈ స్టేడియంకు నరేంద్ర మోదీ పేరు పెట్టడంపై రాహుల్ గాంధీ విమర్శలు గుప్పించారు.

అసలైన నిజం దానంతట అదే బయటపడటం చాలా బాగుందని ఆయన అన్నారు. ‘నరేంద్ర మోదీ స్టేడియం, అదానీ ఎండ్, రిలయన్స్ ఎండ్, కార్యక్రమానికి హాజరైన జై షా’ అంటూ ట్విట్టర్ ద్వారా రాహుల్ ఎద్దేవా చేశారు.