అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

200
car crashed into a canal .. Two killed one lost!

ఏపీలో సోమవారం అర్ధరాతి జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో నలుగురు దుర్మరణం చెందారు.

అనంతపురం జిల్లా పెనుగొండ మండలంలోని ఈ ప్రమాదం జరిగింది.కియా పరిశ్రమ సమీపంలో లారీని కారు వేగంగా ఢీకొట్టింది.

సోమవారం అర్ధరాతి జరిగిన ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇందులో ఇద్దరు యువతులు, మరో ఇద్దరు యువకులు ఉన్నారు.

కారు బెంగళూరు నుంచి హైదరాబాద్‌ వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది.

సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.

మృతులు రేఖ (21), అంచల్‌ సింగ్‌ (21), మహబూబ్‌ అలం (31), మనోజ్‌ మిట్టల్‌ (38) గా గుర్తించారు.

కియా పరిశ్రమ ప్రధాన గేటు వద్ద స్పీడ్ బ్రేకర్ వద్ద స్లో అయిన లారీని కారు వేగంగా ఢీకొట్టినట్లు తెలుస్తోంది. ప్రమాదంలో కారు ముందు భాగంగా నుజ్జునుజ్జయింది.

లారీని ఓవర్ టేక్ చేయాలనుకున్న సమయంలో కారు వేగంగా దూసుకెళ్లి లారీని ఢీ కొట్టినట్లు తెలుస్తోంది. కారు డ్రైవర్ బీరు తాగుతూ డ్రైవ్ చేస్తుండడమే ప్రమాదానికి కారణమని పోలీసులు గుర్తించారు.

ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.